వేములవాడ ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం.
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్) సెప్టెంబర్ 27: వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి, మధుసూదన్ ఆధ్వర్యంలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2023 లో భాగంగా తేదీ:19.09.2023 వరకు నమోదైన ఫామ్-6, 7, 8 ల వివరాలను తెలియజేశారు. కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించిన ఓటర్ల గురించి చర్చించారు. దీనికి సంబంధించి తుది ఓటరు జాబితా తేదీ అక్టోబర్ 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశమునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు భా ర స నాయకులు పొలాస నరేందర్ వి.నిత్యానంద రావు, ఇండియన్ కాంగ్రెస్ నాయకులు, మైలారం రాము,, డి.నరేష్ జింక ఎల్లయ్య, జింక మలేశం, రామస్వామి గౌడ్, వేములవాడ అర్బన్ తహశీల్దార్ ఎస్.మహేష్ కుమార్, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేములవాడ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment