వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ ) ఆగస్టు 18 : వేములవాడ పట్టణంలో కూడళ్ల అభివృద్ధిలో భాగంగా సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్కు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు మొదటి నుంచి వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర ఉంటుందని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతం కులాలకు మతాలకు అతీతంగా సోదర భావంతోనే వెళ్లి విరిసే చైతన్యవంతమైన యువత మేధావులు, పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెల్లా దొరలను పారాదొలటనికి తన విప్లవ పంతాలో దేశంలోని యువకులను మేధావులను స్వాతంత్ర ఉద్యమంలోనికి రావడానికి కృషిన గొప్ప వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. వేములవాడ పట్టణంలోని కూడళ్లకు కొత్త శోభ సంతరించుకునే విధంగా ప్రభుత్వం, మున్సిపల్ పాలకవర్గం ముందుకు పోతుందని అన్నారు. భక్తుల తమ ఆరాధ్